న్యూఢిల్లీ: పూర్తిస్థాయిలో క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధిస్తారన్న ఆందోళనల మధ్య దేశంలో వాటి నియంత్రణకు గల అవకాశాలను పరిశీలించేందుకు కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నది. 2019లో కేంద్ర ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి సుభాష్ గార్గ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ.. డిజిటల్ కరెన్సీలపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని సిఫారసు చేసిన నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకున్నది.
క్రిప్టో కరెన్సీ లేదా వర్చువల్ కరెన్సీలతో జరిపిన లావాదేవీల వివరాలను వెల్లడించాలని దేశంలోని అన్ని కంపెనీలను ఇటీవల కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) కోరింది. క్రిప్టో కరెన్సీ లావాదేవీలను నియంత్రించడానికి వీలుగా సదరు కంపెనీలు తమ బ్యాలెన్స్ షీట్లలో ఆ వివరాలు తెలుపాలని సూచించింది.
దేశంలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలను నియంత్రించడానికి బ్లాక్ చెయిన్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రతిపాదిత ప్యానెల్ సూచించనున్నది. దాని నిర్వహణకు అనుసరించాల్సిన పద్దతులను పరిశీలించాలని ఆర్బీఐని కోరనున్నది.
క్రిప్టో కరెన్సీలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆర్బీఐ.. త్వరలో కీలక నిర్ణయాలు ప్రకటించనున్నది. బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలను చట్టబద్ధం చేయాలా? వద్దా? అన్న విషయమై కేంద్రం నిర్ణయం కోసం వేచి చూస్తున్నది.
పూర్తిస్థాయిలో క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించడానికి బదులు వాటిని ఉపయోగించుకోవడానికి గల అవకాశాలను తాజాగా ఏర్పాటు చేయనున్న కమిటీ పరిశీలించనున్నది. అయితే, ఇది ప్రాథమిక దశలోనే ఉన్నదని, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తరుణ్ తేజ్పాల్పై లైంగిక వేధింపుల కేసు.. విచారణ మే 21కి వాయిదా..!
ఐటీ కొలువుల మేళా : క్రెడిట్ సూస్ లో 1000కి పైగా టెకీల నియామకం!
క్రిప్టోకరెన్సీకి ట్విట్టర్ సీఈఓ వెన్నుదన్ను
తౌటే తుఫాన్: తౌటే అంటే అర్థం తెలుసా..?
కుటుంబాలకు ‘జంట’ సవాళ్లు.. పెరిగిన ఇంధన, హెల్త్కేర్ ఖర్చు!!
క్రిప్టో బిజినెస్పై డ్రాగన్ నిషేధం! ఎలాగంటే!!
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
డొనాల్డ్ ట్రంప్పై క్రిమినల్ ఇన్వేస్టిగేషన్..