గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయిజ మండలం వెంకటాపురంలో ఓ ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకుమార్ రెడ్డి అనే విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి శివార్లలో ఓ లారీ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు హుజురాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..