పాలమూరు, ఏప్రిల్ 25 : ఇంటర్ ఫలితాల్లో పాలమూరులోని రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. సీనియర్ ఎంపీసీలో అమూల్య 993/1000, సాకేత్సింగ్ 991/1000 మార్కులు సాధి ంచి జిల్లా కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటారని కళాశాల కరస్పాండెంట్ చంద్రకళావెంకట్, కళాశాల సలహాదారు వెంకటయ్య, డీన్ భూపాల్రెడ్డి, ప్రిన్సిపాల్ హరిబాబు పేర్కొన్నారు. బైపీసీలో అహ్మదున్నీబేగం 989/1000, దానియా నాజిష్ 987/1000, అనన్య 985/1000, అంకితారెడ్డి 983/ 1000, సుమేధాచంద్ర 982/1000 మార్కులు, ఎంపీసీలో 76.7శాతం, బైపీసీలో 86.6శాతం ఉత్తీర్ణత సాధించారు.
జూనియర్ ఎంపీసీ విభాగంలో విజ్జి 468/470, వర్షిణి 468/ 470, బైపీసీలో తరుణ్సాయి, భావన, హిమబిందు 438/440 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. ఫస్టియర్ ఎంపీసీలో 66శాతం, బైపీసీలో 83శాతం ఫలితాల్లో రిషి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం గురువారం సన్మానించారు. పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మిఠాయిలు పంపిణీ చేసి ధన్యవాదాలు తెలిపారు.
జేఈఈ-2024 ఫలితాల్లో రిషి జయకేతనాన్ని ఎగురవేసింది. కళాశాల స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఇంజినీరింగ్ విభాగంలో విజయపరంపరను కొనసాగిస్తూనే ఉన్నది. వెనుకబడిన పాలమూరు జిల్లా విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలను చేరువ చేసి ఉజ్వల భవిష్యత్ను ప్రసాదించిన ఘనత రిషికే దక్కింది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థంలో సీట్లు సంపాదించి జిల్లా పేరును పతాక స్థాయిలో నిలబెట్టిన గొప్ప సంస్థగా ఎదగడం గర్వంగా ఉందని రిషి అకాడమీ డైరెక్టర్ ఎస్.చంద్రకళావెంకట్, అడ్వైజర్ ఎస్.వెంకటయ్య, డీన్ భూపాల్రెడ్డి తెలిపారు. కాగా జేఈఈ ఫలితాల్లో జీ.సాకేత్సింగ్ 99.60 పర్సంటైల్, కే.కౌశిక్యాదవ్ 98.87 పర్సంటైల్, వై.వినయ్రెడ్డి 98.67 పర్సంటైల్తో రాణించారు. అదేవిధంగా జీ.సాకేత్సింగ్ ఫిజిక్స్లో 100పర్సంటైల్ సాధించారు. మొత్తం 65 మంది విద్యార్థులు అత్యుత్తమ పర్సంటైల్ సాధించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన అధ్యాపకులు, సహకరించిన తల్లిదండ్రులకు వారు అభినందనలు తెలియజేశారు.