మక్తల్ టౌన్, ఏప్రిల్ 25 : కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని నారాయణపేట బీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు రాజేందర్రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అధ్యక్షతన పట్టణంలోని వట్టం రవి కన్వెన్షన్ హాల్లో గురువారం మండల బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ పేట జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్పై లేనిపోని అబద్ధపు మాటలు చెప్పి రేవంత్ ప్రజలను మోసం చేశారన్నారు. డిసెంబర్ 9న రెం డు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి.. నాలుగు నెలలవుతున్నా ఎలాంటి చర్యలు లేవన్నారు. పార్లమెం ట్ ఎన్నికల్లో మళ్లీ ప్రజలను మోసం చేయాలనే ల క్ష్యంతోనే ఆగస్టు 15న రుణమాఫీ చేస్తామని రేవంత్రెడ్డి చెబుతున్నాడని, పాలమూరు ప్రజలు కాం గ్రెస్ హామీలకు మరోసారి మోసపోకుండా మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డిని అత్యధిక మెజార్టీతో మరోసారి గెలిపించాలని కోరారు.
నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి చెప్పారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ప్రతి కార్యకర్తను ఆదరించామని, కొందరు అధికార దాహంతో తల్లిలాంటి బీఆర్ఎస్ను వీడి ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. అటువంటి వారిని మేము ఆ పమని, క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని వీడిన వారంతా అ వకాశవాదులేనన్నారు.
సీఎం రేవంత్రెడ్డికి సాగునీటిపై ఎలాంటి అవగాహన లేకపోవడం వల్లనే మ క్త ల్ మండలం భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కొ డంగల్కు పైప్లైన్ ద్వారా నీటిని తీసుకెళ్తానని చెబుతున్నా న్నారు. ఈ ప్రాంత రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరు కోమన్నారు. భూత్పూర్ రిజర్వాయ ర్ నుంచి నీటిని తరలిస్తే సహించేది లేదని, హామీలను నెరవేర్చకుండా కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నీటిని తరలిస్తామని చెబుతూ ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎం పీ అభ్యర్థి శ్రీనివాస్రెడ్డి గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు.