రామచంద్రపురం/సంగారెడ్డి : నకిలీ కరెన్సీ తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను జిల్లాలోని రామచంద్రపురం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రామచంద్రపురం సీఐ సంజయ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు జిల్లా ప్రగతి నగర్కు చెందిన కంచర్ల శివ నారాయణ రెడ్డి ఇ అలియాస్ శివారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం సమయంలో లింగంపల్లి చౌరస్తా వద్ద పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తనిఖీ చేయగా అతని వద్ద రూ.2వేల నోట్లు ఉన్న మొత్తం 6 లక్షల ఫేక్ కరెన్సీ ఉన్నట్లు గుర్తించారు.
ఈ విషయమై నిందితున్ని పోలీసులు విచారించగా ఈ ఫేక్ కరెన్సీ చెలమణిలో తనతోపాటు హైదరాబాద్లోని అంబర్ పేటకు చెందిన తిమ్మానాయుడుతో పాటు సరూర్నగర్ బృందావన్ కాలనీ లో నివాసం ఉంటున్న లలిత కూడా కరెన్సీ భాగస్వాములని ఒప్పుకొన్నారు. ఈ మేరకు ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని శనివారం నిందితులను రిమాండ్ కు తరలించారు.
ఇవి కూడా చదవండి..
టీకాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం
గన్తో డిప్యూటీ తహసీల్దార్ హల్ చల్
ఆక్సిజన్ ప్రాముఖ్యం వెలకట్టలేనిది : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కరోనాతో కొల్లాపూర్ తహసీల్దార్ మృతి
అంకిరెడ్డిపల్లిలో బ్లాక్ ఫంగస్తో వ్యక్తి మృతి
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి