సిరిసిల్ల రూరల్ : సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రగుడు బాల దుర్గయ్య (40) అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్తో హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనాతో 15 రోజులుగా సిరిసిల్లలో ఓ దవాఖానలో చికిత్స పొందిన దుర్గయ్య, బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడంతో వైద్యులు హైదరాబాద్ గాంధీ దవాఖానకి మూడు రోజుల క్రితం రెఫర్ చేశారు. దీంతో అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారి జామున మృతి చెందాడు. మృతుడికి భార్య రజిత, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి