హైదరాబాద్ : కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ దేశంలో ఎవరూ తీసుకోని గొప్ప నిర్ణయాలు తీసుకోవడం సత్ఫలితాలు ఇస్తున్నాయని గిరిజన, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కొవిడ్ స్ప్రెడర్స్ కు మొదటగా వ్యాక్సిన్ ఇవ్వాలనడం ఇందులో భాగమేనని, ఇందుకు సీఎంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మంత్రి తెలిపారు. జడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, అధికారులతో కలిసి కొవిడ్ స్ప్రెడర్ వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించారు. రెండో దశ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. మంత్రితో పాటు జడ్పీ చైర్మన్ వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో పాటు కొవిడ్ స్ర్పెడర్స్ కు ఇచ్చే వ్యాక్సిన్ కేంద్రం లో రోగులను పరామర్శించారు. వారికి జాగ్రత్తలు చెప్పారు.
ప్రజల ప్రాణాలే ముఖ్యమని భావించి లాక్ డౌన్ విధించడం వల్ల లాక్ డౌన్ కు ముందు 33,34 శాతంగా ఉన్న కొవిడ్ నేడు 8,9 శాతానికి తగ్గిందన్నారు. కొవిడ్ ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించడంతో పాటు కొవిడ్ బారిన పడ్డ వారికి ప్రభుత్వ హాస్పిటల్ లో మెరుగైన వైద్యం అందించేందుకు తీసుకున్న చర్యల వల్ల కూడా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. సీఎం ఆలోచనకనుగుణంగా కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు అన్నారు.
కొవిడ్ కష్టకాలంలో కూడా రైతుకు ఇబ్బంది ఉండకూడదని సీఎం కేసీసిఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, ఈ కొనుగోలును అనుకున్న సమయంలో పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా వానాకాలం పంటల సమయం వచ్చినందున రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని, నీటి సరఫరాలో, కరెంటు విషయంలో సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. దీనిపై కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులు, నేతలతో కలిసి సమీక్ష చేస్తానని చెప్పారు.
మహబూబాబాద్ లో గ్రామాల్లో కొవిడ్ ను కట్టడి చేసేందుకు 450 కమిటీలు పనిచేస్తున్నాయని, ఈ కమిటీలు కొవిడ్ లక్షణాలు ఉన్న వారిని వెంటనే గుర్తించి వారికి వైద్యం అందించే కృషి చేస్తున్నారని ప్రశంసిచారు.