చందంపేట, జూలై 04 : రైతు సమన్వయ సమితి చందంపేట మండల మాజీ అధ్యక్షుడు రమావత్ లాలు నాయక్ చేసిన సేవలు చిరస్మరణీయమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం చందంపేట మండలం బిల్డింగ్ తండాలో రమావత్ లాలు నాయక్ 6వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. లాలు నాయక్ పేద ప్రజల పక్షపాతిగా, ప్రజా సేవకుడిగా గుర్తింపు పొందారని కొనియాడారు. లాలు నాయక్ ప్రజా సంక్షేమం కోసం చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్న ఆయన, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

లాలు నాయక్ సేవలు చిరస్మరణీయం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్