Suryapet | సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో బోనాల ఊరేగింపు సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. బీఆర్ఎస్ యువజన కార్యకర్త గుణగంటి చంద్రకాంత్గౌడ్పై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో చంద్రకాంత్గౌడ్తోపాటు మరికొందరికి గాయాలయ్యాయి.
గురువారం (ఆగస్టు 13) సాయంత్రం 6 గంటల సమయంలో బోనాల ఊరేగింపు కొనసాగుతుండగా కొందరు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన చంద్రకాంత్గౌడ్ను హుటాహుటిన సూర్యాపేట మెడికల్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.