వరంగల్ రూరల్ : కొవిడ్ టీకాల కేటాయింపులో కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. జిల్లాలోని వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ చికిత్స కోసం ప్రత్యేక అక్సిజన్ వార్డును ప్రారంభించారు. అనంతరం దవాఖానలో కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించారు. రాష్ట్రంలో తయారైన వ్యాక్సిన్లలో తెలంగాణ రాష్ట్రానికి పంపిణీ చేస్తున్న వ్యాక్సిన్ల కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు.
కొవిడ్ వ్యాక్సిన్ల పంపిణీని కేంద్రం తన ఆధీనంలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ముందుగా వ్యాక్సిన్లు సరఫరా చేయాలన్నారు.
వరంగల్ గ్రామీణ జిల్లాలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉందని, కరోనా కట్టడికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పర్వతగిరి పీహెచ్సీని సందర్శించారు.
ఇవి కూడా చదవండి..
గన్తో డిప్యూటీ తహసీల్దార్ హల్ చల్
ఆక్సిజన్ ప్రాముఖ్యం వెలకట్టలేనిది : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కరోనాతో కొల్లాపూర్ తహసీల్దార్ మృతి
అంకిరెడ్డిపల్లిలో బ్లాక్ ఫంగస్తో వ్యక్తి మృతి
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి