వరంగల్: బల్దియా పరిధి జాతీయ సాంకేతిక విద్యా సంస్థ(ఎన్.ఐ.టి) వద్ద గల త్రివేణి సూపర్ మార్కెట్ యాజమాన్యానికి రూ.5 వేలు పెనాల్టీ విధించినట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుడు రమేష్ ఇటీవల అదనపు కమిషనర్కు గడువు ముగిసిన పచ్చళ్ళ విషయమైఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో బుధవారం సూపర్ మార్కెట్లో తనిఖీలు నిర్వహించామన్నారు.
ఈ క్రమంలో 03/2019 (లేబుల్ గల) గడువు ముగిసిన ప్రియా పచ్చళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ప్రజల ఆరోగ్యానికి హానీ కలిగించేలా విక్రయాలు జరుపుతున్న సూపర్ మార్కెట్ యజమాన్యానికి జరిమానా విధించామన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం అయితే సూపర్ మార్కెట్ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, జవాన్, ఏలీయా, అనిల్, రవి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన ముస్లిం యువకులు..
పేదరికంతో రోడ్డున పడ్డ కుటుంబం..ఆదుకున్న మంత్రి సత్యవతి
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు : మంత్రి పువ్వాడ
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి