వికారాబాద్ : కరోనా లక్షణాలు ఉన్న వారికి అవసరమున్న మందులు, మెడికల్ కిట్లను అందించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు. పరిగి ప్రేమ్ నగర్ కాలనీలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, కలెక్టర్ పౌసుమి బసు, జిల్లా వైద్యాధికారి షిండేతో కలిసి రెండో విడుత ఫివర్ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జ్వర సర్వే ద్వారా ముందస్తుగా గుర్తించటంతో వ్యాధి వ్యాప్తి నివారణ తో పాటు, హోం ఐసొలేషన్లో ఉంటూ జాగ్రత్తలు తీసుకోవడానికి వీలు పడుతుందన్నారు.
సర్వే నిర్వహిస్తున్న ఆశ కార్యకర్త లతో మాట్లాడారు. కాలనీల ప్రజలతో మాట్లాడి, ఏ మేరకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం పరిగి ఏరియా దవాఖానను తనిఖీ చేశారు.
కరోనా కాకుండా ఇతర సాధారణ వ్యాధులతో వచ్చే వారికి కూడా వైద్యం అందించాలని మంత్రి సూచించారు. దవాఖానలో గర్భిణులకు అందిస్తున్న వైద్యంపై అరా తీశారు. జిల్లాలో సరిపడా మందులు, అక్సిజన్ నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు.
కరోనా వస్తే ధైర్యంగా ఉంటూ ఎదుర్కోవాలన్నారు. అనంతగిరిలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో బెడ్లు ఏర్పాటు చేయటం చేస్తామన్నారు. లాక్ డౌన్కు ప్రజలు సహకరించాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా ఎఫెక్ట్: దేశంలో రెండింతలైన గ్రామీణ నిరుద్యోగం
టీకాల తయారీపై గడ్కరీ ప్రకటన.. కాంగ్రెస్ చురకలు