భోపాల్: మహిళను నెల రోజులుగా నిర్బంధించిన ఒక వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అలాగే చిత్రహింసలకు గురి చేశాడు. నోటిలో కారం పోసి ఫెవీ క్విక్తో సీల్ చేశాడు. నరక యాతన అనుభవించిన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో ఈ దారుణం జరిగింది. (Madhya Pradesh horror) ఇరుగుపొరుగున నివసించే 23 ఏళ్ల మహిళ, 23 ఏళ్ల అయాన్ పఠాన్ మధ్య పరిచయం వారిద్దరి మధ్య సంబంధానికి దారితీసింది. ఇది తెలుసుకున్న తల్లి తన కుమార్తెను మందలించింది. పఠాన్కు దూరంగా ఉండమని చెప్పింది. అలాగే కుమార్తెను శివపురికి పంపింది.
కాగా, ఆ మహిళ గుణాకు తిరిగి వచ్చింది. పఠాన్తో కలిసి అతడి ఇంట్లో నివసించింది. మోజు తీరిన కొన్ని రోజుల తర్వాత పఠాన్ ఆ మహిళను హింసించసాగాడు. ఆమె తల్లి పేరున ఉన్న ఆస్తిని తన పేరు మీద బదిలీ చేయాలంటూ చిత్రహింసలకు గురిచేశాడు. ఈ నెల 16న బెల్ట్, ప్లాస్టిక్ పైప్తో ఆమెను దారుణంగా కొట్టాడు. కంట్లో, నోట్లో కారం పోశాడు. ఏడ్పు బయటకు వినిపించకుండా ఫెవీ క్విక్తో పెదాలను అంటించాడు.
మరోవైపు ఆరోగ్య పరిస్థితి క్షీణించిన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. ఆ మహిళను నిర్బంధించిన పఠాన్ ఇంటి నుంచి బెల్ట్, ప్లాస్టిక్ పైప్, ఫెవీ క్విక్, మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పఠాన్ను అరెస్ట్ చేశారు. అత్యాచారంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.