ములుగు : జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ రాంమ్మూర్తి మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాంమ్మూర్తి గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా రాంమ్మూర్తి అకాల మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రైలుకింద పడి తల్లీ, కూతురు మృతి..కుమారుడి పరిస్థితి విషమం
తెలంగాణ ఇంజినీర్లు దేశానికే మార్గదర్శకులు
వింబుల్డన్ చాంపియన్ ఓ క్రికెటర్ అని మీకు తెలుసా?
యాదాద్రీశుడి సేవలో జీహెచ్ఎంసీ మేయర్
నాటు తుపాకితో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
గుండెపోటుతో మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మృతి