పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా రైలు కిందపడి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన రామగుండం రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో తల్లి గోదావరిఖని 8వకాలనీకి చెందిన జింగిటి అరుణ (35) అక్కడికక్కడే మృతి చెందింది. కుమార్తె సాత్విక (2) చికిత్స పొందుతూ మృతి చెందగా.. కుమారుడు సాత్విక్ (5) పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, 8వ కాలనీకి చెందిన ప్రవీణ్ను ఆరేండ్ల క్రితం అరుణ ప్రేమ వివాహం చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ ఇంజినీర్లు దేశానికే మార్గదర్శకులు
వింబుల్డన్ చాంపియన్ ఓ క్రికెటర్ అని మీకు తెలుసా?
యాదాద్రీశుడి సేవలో జీహెచ్ఎంసీ మేయర్
నాటు తుపాకితో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
గుండెపోటుతో మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మృతి