జహీరాబాద్/సంగారెడ్డి : జహీరాబాద్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతంలో వ్యాపారులు, ఏటీఎం సెంట్ల వద్ద డబ్బులు డ్రా చేసుకునే వ్యక్తులు, ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులను తుపాకీతో బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని అరెస్టు చేశామని జహీరాబాద్ పట్టణ సీఐ రాజశేఖర్ తెలిపారు. ఆదివారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా మగ్దుంపూర్ గ్రామానికి చెందిన జుబేర్ కొద్ది రోజులుగా నాటు తుపాకితో బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
జుబేర్ తన అనుచరులతో కలిసి ముఠాగా ఏర్పడి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. శనివారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు పాత ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించామన్నారు. అతడి బ్యాగులో నాటు తుపాకి, కత్తులను గుర్తించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ ఇంజినీర్లు దేశానికే మార్గదర్శకులు
వింబుల్డన్ చాంపియన్ ఓ క్రికెటర్ అని మీకు తెలుసా?
యాదాద్రీశుడి సేవలో జీహెచ్ఎంసీ మేయర్