హైదరాబాద్ : తెలంగాణ ఇంజినీర్లు దేశానికే మార్గదర్శకులని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ఇంజినీర్స్ డే వేడుకలు ఆదివారం ఎర్రమంజిల్ జలసౌధాలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఇంజినీర్లు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఆర్. విద్యాసాగర్ రావు విగ్రహాలకు వినోద్ కుమార్
పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో ఇంజినీర్ల పాత్ర మరువలేనిదన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వెంటనే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ పేరిట తెలంగాణ ఇంజినీర్స్ డే ను ప్రకటించిన సీఎం కేసీఆర్ ప్రకటించారు తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ఇంజినీర్లు గొప్ప పాత్రను పోషిస్తున్నారని వినోద్ కమార్ ప్రశంసించారు. ఇంజినీర్ల విశిష్టతను భావి తరాలకు తెలిపేందుకు ప్రత్యేక గ్రంథాన్ని రచించాలన్నారు.
చెప్పుకుంటేనే చరిత్ర.. అనే విషయాన్ని మరవద్దన్నారు. కార్యక్రమంలో వాటర్ రిసోర్సెస్ సంస్థ చైర్మన్ వీ. ప్రకాష్, ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు వెంకటేష్, ప్రముఖ ఇంజినీర్లు శ్యాం ప్రసాద్ రెడ్డి, దామోదర్ రెడ్డి, జనార్దన్, వీరయ్య, శివాజీ, ఈఎన్సీ మురళీధర్, తదితరులు పాల్గొన్నారు.