ఖమ్మం : ఖమ్మం(Khammam) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈత(Swimming) సరదా ఇద్దరి ప్రాణాలను(Boys died) బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన ఖమ్మం గ్రామీణ మండలం ధంసలాపు రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్నేరు వాగులో(Munneru river) ముగ్గురు బాలురు ఈతకు వెళ్లి నీటిలో గల్లంతయ్యారు.
గమనించిన స్థానికులు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతులు గణేష్(14), లోకేష్(12)గా గుర్తించారు. గల్లైంతైన మరో బాలుడి కోసం గాలిస్తున్నారు. కాగా, పిల్లల మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.