Actress Namitha | ఏపీలోని భీమిలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు బరిలోకి దిగారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రచారం పెంచారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో సినీ గ్లామర్ను సైతం జోడించారు. ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు నమిత ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ పార్టీ నమితను స్టార్ క్యాంపెయిన్గా నియమించిన విషయం తెలిసిందే.
ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె గంటా శ్రీనివాసరావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. భీమిలి నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో నమిత పాల్గొన్నారు. అభివృద్ధి కావాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా జై బాలయ్య, జై చంద్రబాబు, జై పవన్ కల్యాణ్, జై గంటా శ్రీనివాసరావు అని నినదిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఇంతకు ముందు పలువురు తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులకు సైతం మద్దతుగా నమిత ప్రచారం నిర్వహించారు.
అభివృద్ధి కావాలంటే సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించండి – సినీ నటి నమిత
” సైకిల్ ” గుర్తుకు ఓటేద్దాం…!
భీమిలి అభివృద్ధికి తోడ్పడదాం.!!#GantaSrinivasaRao #ChandraBabuNaidu #TeluguDesamParty #TDPJSPBJPWinning #PrajaGalam #VoteForCycle #ManaGantaManaBheemili #BheemiliTDP… pic.twitter.com/3AQN745Wfw— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) May 9, 2024