Traffic Restrictions | హైదరాబాద్ : ఈ నెల 10వ తేదీన ఎల్బీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను బీజేపీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సిటీ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.
బేగంపేట్ ఎయిర్పోర్ట్, షాపర్స్ స్టాప్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట ఫ్లై ఓవర్, గ్రీన్ ల్యాండ్స్, మోనప్ప ఐలాండ్ జంక్షన్, యశోదా హాస్పిటల్, రాజ్ భవన్, వీవీ విగ్రహం, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు జంక్షన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
నాంపల్లి, బషీర్బాగ్, బీజేఆర్ స్టాచ్యూ, ఎస్బీఐ గన్ఫౌండ్రీ, జీపీవో ఆబిడ్ రోడ్ సర్కిల్, నాంపల్లి స్టేషన్ రోడ్డు, ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్, సుజాత స్కూల్ జంక్షన్, కేఎల్కే బిల్డింగ్, లిబర్టీ, హిమాయత్నగర్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్, హైదర్ గూడ వద్ద వాహనాలను మళ్లించనున్నారు.