అమ్రాబాద్, మే 9 : తేనెటీగల దాడిలో( Bee attack) యువకుడు మృతి(Youth dies) చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా)Nagarkurnool) అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. మన్ననూర్కు చెందిన తారక్ (22) తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్తో నేలను దున్నుతుండగా.. చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో వాటి నుంచి తప్పించుకునే క్రమంలో పొలంలో పరుగెడుతుండగా బోర్లాపడి తారక్ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.