Loksabha Elections 2024 : కాంగ్రెస్ను వీడి కాషాయ పార్టీలో చేరిన రాధిక ఖేరా హస్తం పార్టీ లక్ష్యంగా తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణకు చోటులేదని అన్నారు. ఆ పార్టీలో వారు ఎవరూ కలిసి నడవడానికి లేదని, ఒకరిని ఒకరు వెనక్కి లాగుతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి కాంగ్రెస్ పార్టీలో కేవలం ఓ కుటుంబమే మిగులుతుందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ను ఒకరి తర్వాత ఒకరు వీడుతున్నారని, 30,40 ఏండ్ల నుంచీ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు, నేతలకు ఏమాత్రం గుర్తింపు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీని గాంధీల అల్లుడు రాబర్ట్ వాద్రా పేరుతో రాసిచ్చేస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వాద్రా యజమాని అని పార్టీలో ఆయన ఏదైనా పొందేందుకు అర్హుడని రాధిక ఖేరా చెప్పారు.
కాగా, తాను అయోధ్యలో రామాలయాన్ని సందర్శించిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో తనను తీవ్రంగా వేధించారని, పార్టీ నేతల తీరుపై అగ్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ చేపట్టలేదని రాధిక ఖేరా ఆరోపించారు. పార్టీ తీరుపై కలత చెందుతూ కాంగ్రెస్కు రాజీనామా చేసిన రాధిక ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
Read More :