TS EAPCET | హైదరాబాద్ : టీఎస్ ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. తొలి రోజు 94.4 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఎస్1 సెషన్కు 94.3 శాతం మంది విద్యార్థులు, ఎస్2 సెషన్కు 94.4 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎస్1 సెషన్లో 50,978 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 48,076 మంది హాజరయ్యారు. ఎస్2 సెషన్లో 50,983 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 48,152 మంది హాజరయ్యారు. అత్యధికంగా ఆదిలాబాద్లో 99 శాతం మంది హాజరు కాగా, అత్యల్పంగా గుంటూరులో 92.4 శాతం మంది హాజరయ్యారు. మరో రెండు రోజుల పాటు ఇంజినీరింగ్ పరీక్షలు కొనసాగనున్నాయి.