న్యూఢిల్లీ, జూలై 25: హోండా కార్స్..దేశీయ మార్కెట్కు మరో మాడల్ను తీసుకొచ్చింది. ప్రీమియం హైబ్రిడ్ ఎస్యూవీ జెడ్ఆర్-వీ ఈ మాడల్ను పరిచయం చేసింది. జపాన్ నుంచి దిగుమతి చేసుకొని దేశీయంగా విక్రయించనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.47.99 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు నూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. కేవలం 7.9 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్న ఈ కారు లీటర్ పెట్రోల్కు 22.80 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. వైర్లెస్ యాపిల్ కార్ప్లేతో అనుసంధానమైన 9 ఇంచుల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పూర్తిస్థాయిలో డ్రైవర్ సైడ్ 10.2 ఇంచుల టచ్స్క్రీన్, 12 స్పీకర్లు, వైర్లెస్ స్మార్ట్ఫోన్ చార్జింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎనిమిది ఎయిర్బ్యాగ్లు, వెనుక రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్స్తో తీర్చిదిద్దింది.