న్యూఢిల్లీ, జూలై 25: ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్.. బ్రాడ్బ్యాండ్ కస్టమర్ల కోసం ప్రత్యేక ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 25 ఎంబీపీఎస్ స్పీడ్తో 700 జీబీ డాటా ప్లాన్ను ఆరు నెలల కాలపరిమితితో రూ.1,449కే అందిస్తున్నది. ఈ డాటా ప్లాన్ ముగిసిన తర్వాత డాటా వేగం 2 ఎంబీపీఎస్కు పడిపోనున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారిని దృష్టిలో పెట్టుకొని బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ను ఆవిష్కరించింది.
నెలవారి ప్లాన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. నెలకు రూ.259 చొప్పున వసూలు చేస్తున్నది. అలాగే ఆరు నెలలు తీసుకున్నవారికి నెలకు రూ.241 పడనున్నది. దీంతోపాటు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ల్యాండ్లైన్ ఫోన్ను కొనుగోలు చేయాల్సివుంటుందని తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో మిగతా సంస్థలు నెలకు రూ.1,000 కంటే అధికంగా వసూలు చేస్తున్నారు.