అమరావతి : ఏపీలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు (Elections) ఆర్టీసీ (RTC) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా తెలంగాణలో అధికశాతం ఉన్న ఆంధ్రా ఓటర్లను సొంత ప్రాంతాలకు బస్ సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రత్యేక సర్వీసులు నడుపనుంది. హైదరాబాద్ (Hyderabad) , బెంగళూరు నుంచి ప్రత్యేక సర్వీసులను నడుపనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈనెల 11న రెండవ శనివారం , ఆదివారం సెలవు దినం కావడం, పోలింగ్ రోజున కూడా సెలవు దినం కావడంతో స్వస్థలాలకు చేరుకునేందుకు బస్సుల అవసరాలను గుర్తించిన ఆర్టీసీ అధికారులు అందుకనుగుణంగా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 199 సర్వీసులు హైదరాబాద్ నుంచి, 95 సర్వీసులు బెంగళూరు నుంచి ఏపీలోని అన్ని ప్రాంతాలకు బస్సులను నడిపేందుకు నిర్ణయించారు. ఈ పాటికే ప్రైవేట్ బస్సులు, రైళ్ల (Trains) లో రిజర్వేషన్ల కోటా పూర్తికావడంతో టికెట్లు దొరకని వారు ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్ల కోసం తంటాలు పడుతున్నారు.