టాలీవుడ్ హీరోలలో ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా మారిపోయే స్టార్ నాగార్జున. పాత తరం కొత్త తరం హీరోలకు వారధిగా ఉన్నాడు ఈయన. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ అభిమానులను సంతోష పెడుతున్నాడు. ఈ మధ్యే ఈయన నటించిన వైల్డ్ డాగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి టాక్ బాగానే వచ్చినా కూడా కలెక్షన్లు మాత్రం రాలేదు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవలే రానా దగ్గుబాటి టాక్ షోకి వచ్చాడు నాగార్జున.
అక్కడ చాలా విషయాల గురించి క్లారిటీ ఇచ్చాడు ఈ సీనియర్ హీరో. ముఖ్యంగా ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉంది.. సినిమాలు ఎలా తీస్తున్నారు.. అనే విషయం గురించి కూడా మాట్లాడుకున్నారు.
దానికి తోడు సోషల్ మీడియా గురించి సంచలన కామెంట్స్ చేసాడు నాగార్జున.
దానిని పూర్తిగా దూరం పెట్టడమే మంచిది అని క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే మీ జనరేషన్ నుంచి ఇప్పటి తరం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందా.. 90ల నుంచి వెనక్కి తీసుకు రావాలనుకునే ఒక క్వాలిటీ చెప్పండి అంటూ నాగార్జునను అడిగాడు రానా. దీనికి ఎవరూ ఊహించని సమాధానం చెప్పాడు మన్మధుడు. (ఫినిష్ ద మూవీ గాట్ డ్యామ్ ఇన్ 50 డేస్ మ్యాన్) 50 రోజుల్లో ఒక సినిమాను చేయండి అంటూ సీరియస్ అయ్యాడు.
ఈ రోజుల్లో ఇద్దరు ఒక్క సినిమా కోసం ఎందుకు సంవత్సరాలు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు అంటున్నాడు ఈయన. ఒకప్పుడు ఎలాంటి సినిమా అయినా 50 రోజులు పూర్తయ్యేది.
కానీ ఇప్పుడు అలా జరగడం లేదు.
సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయడం నేర్చుకోవాలి.. ఒక నిర్మాతగా అది ఎంత లాభం అనేది నాకు తెలుసు అని చెప్పుకొచ్చాడు నాగార్జున. 90స్ నుంచి తాను వెనక్కి తీసుకు రావాలి అనుకునే క్వాలిటీ ఇదే అని కుండబద్దలు కొట్టాడు నాగార్జున. అలాగే ఈ తరం దర్శకులపై సెటైర్లు కూడా వేశాడు.
ఇవి కూడా చదవండి..
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్లోకి వరుణ్తేజ్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్