కరోనా సెకండ్ వేవ్ వలన ఏప్రిల్ నుండి సినిమా షూటింగ్స్ అన్ని స్తంభించిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులు కొన్నాళ్లుగా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గముఖం పడుతుండడంతో తిరిగి షూటింగ్స్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. యువ హీరోలు నిఖిల్,నితిన్తో పాటు పలువురు స్టార్స్ షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు సిద్ధం అయ్యారు.
హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నితిన్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మ్యాస్ట్రో అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో నితిన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటిస్తుండగా.. మిల్కీబ్యూటీ తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. హిందీలో సూపర్ హిట్ సాధించిన అందాదున్ మూవీకి రీమేక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తుండగా.. జె.యువరాజ్ కెమెరామెన్గా చేస్తున్నారు. కరోనా వలన ఆగిన ఈ చిత్రం చివరి షెడ్యూల్ నేటి నుండి హైదరాబాద్లో జరగనుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. అతి త్వరలోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారు.