న్యూఢిల్లీ: వచ్చే 2030 నాటికి పూర్తిస్థాయిలో విద్యుత్ వాహనాలతో ఫుడ్ డెలివరీ చేస్తామని ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో విద్యుత్ వాహనాలతో ఫుడ్ డెలివరీ చేపట్టింది. వచ్చే తొమ్మిదేండ్లలో పూర్తిగా విద్యుత్ వాహనాలనే వాడతామని సంస్థ సీఈవో కం కోఫౌండర్ దీపిందర్ గోయల్ తెలిపారు.
ప్రస్తుతం విద్యుత్ వాహనాల వాడకం తక్కువ, వందశాతం ఎలక్ట్రిక్ వాహనాల వాడకం అంత తేలిక కాదని దీపిందర్ గోయల్ తన బ్లాగ్లో రాశారు. దీనికి తప్పనిసరిగా చాలా టైం పడుతుందని పేర్కొన్నారు.
ఇప్పటికైతే, విద్యుత్ వాహనాల దత్తత రేటు చాలా తక్కువ, అందునా టూ వీలర్ ఇండస్ట్రీలో ఇది సాధారణం. లిమిటెడ్ బ్యాటరీ రేంజ్ కూడా ప్రస్తుతం విద్యుత్ వాహనాల వాడకంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు దీపిందర్ గోయల్.
దీంతోపాటు మౌలిక వసతులు, లాక్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ న్యూ టెక్నాలజీ, అధిక ఖర్చులు కూడా విద్యుత్ వాహనాల వాడకానికి వెనుకంజ వేయడానికి కారణం అన్న విమర్శ ఉంది. తాము విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేందుకు తమకు బహుళ భాగస్వాములు ఉన్నారన్నారు.
వందశాతం విద్యుత్ వాహనాల వాడకంలో వాల్మార్ట్ సారధ్యంలో ఫ్లిప్కార్ట్ కూడా భాగస్వామిగా ఉంది. ఈ అలయెన్స్లో విప్రో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భాగస్వాములుగా ఉన్నాయి.
ప్రస్తుతం జొమాటో తన మొత్తం ఆర్డర్లలో 20 శాతం సైకిళ్లపై డెలివరీ చేస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 35 శాతం సైకిళ్లపైనే డెలివరీలు పూర్తి చేస్తున్నది. బ్యాటరీ ఉత్పత్తిదారులు, ప్రభుత్వ విధానం, చార్జింగ్ మౌలిక వసతులపైనే ఈవీల వైపు త్వరగా పరివర్తన చెందుతుందని దీపిందర్ గోయల్ వ్యాఖ్యానించారు.
జూన్ 30 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ను పొడిగించిన పేటీఎం…
ఎస్బీఐ కస్టమర్లకు గమనిక.. ఆ పత్రాలు సమర్పిస్తేనే సేవలు
రాష్ట్ర ప్రభుత్వానికి 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు
తమిళనాడులో మరో వారం లాక్డౌన్ పొడగింపు
చరిత్రలో ఈరోజు : ఐదుగురిలో తొలిసారి ఎయిడ్స్ గుర్తింపు
ట్విటర్కు చివరి హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం
కొవిడ్ కిట్ లో కరోనిల్ : పతంజలి ప్రతిపాదన వ్యతిరేకించిన ఐఎంఏ
ఢిల్లీ అన్లాక్.. సరి, భేసి విధానంలో మాల్స్, మార్కెట్లకు అనుమతి
వెంకయ్య ఖాతాకు బ్లూటిక్ రీస్టోర్ చేసిన ట్విటర్
జైసల్మేర్ జిల్లాలో పవర్గ్రిడ్ ఆక్సిజన్ ప్లాంటు…
ఆరెస్సెస్ చీఫ్ భగవత్ ట్విట్టర్ బ్లూటిక్ రిమూవ్, అయితే!
ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చార్జీలు.. ఏ బ్యాంకులో ఎంత అంటే …?