గంజాయి అక్రమ రవాణా చేస్తూ అమెరికాలో ఎయిరిండియా కోపైలట్ ఒకరు పట్టుబడ్డారు. శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్టులో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం నాడు ఓ కోపైలట్ స్టాఫ్ ఆన్ డ్యూటీ కింద ప్యాసింజర్ క్యాబిన్లో ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కో వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో అతడు విమానాన్ని నడపాల్సి ఉంది. ఈ క్రమంలో శాన్ఫ్రాన్సిస్కో అధికారులు జరిపిన తనిఖీల్లో అతని బ్యాగ్లో గంజాయి పట్టబడుంది. దీంతో అధికారులు ఎయిరిండియాకు సమాచారం అందించారు. అనంతరం అతడిని వేరే విమానంలో భారత్కు పంపించారు.
ఏప్రిల్ 14వ తేదీన జరిగిన ఈ ఘటనపై డీజీసీఏకు ఎయిరిండియా ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని సోషల్మీడియా వేదికగా వెల్లడించింది. చట్ట ఉల్లంఘనలను ఏమాత్రం ఉపేక్షించబోమని తెలిపింది. కంపెనీ నిబంధనల ప్రకారం సదరు కోపైలట్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.