న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి స్రుష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు.. అందరూ అల్లాడిపోతున్నారు. దీని నివారణకు రూ. లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తున్నది. కొందరు ఆ డబ్బుల్లేక ఏమీ చేయలేక కుదేలవుతున్నారు. సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
అటువంటి అభ్యాగుల కోసం ముందుకు వచ్చారు 17 మంది ఐటీ ప్రొఫెషనల్స్.. వీరంతా హైదరాబాదీలే. ఐటీ సెక్టార్లో గానీ, స్టార్టప్ ప్రొఫెషనల్స్గా గానీ పనిచేస్తున్నారు. కరోనాతో చితికి పోయిన బాధలు వీరిని కదిలించాయి.
అయితేనేం. ఒకరినొకరు కలుసుకోలేదు.. కానీ వాట్సాప్ గ్రూప్లో ఆన్లైన్ చర్చలో సంప్రదించుకున్నారు. ఆపత్కాలంలో అవసరమైన వారికి అండగా నిలవాలని కోరుకున్నారు. విరాళాల కోసం వారు ఇచ్చిన పిలుపు ఈ నెల 7 నాటికి 4,254 మంది దాతలను కదిలించింది.
దీంతో రూ.2,17,30,571 డబ్బులు జమ అయ్యాయి. ఈ నిధులతో 312 కోవిడ్-19 బాధితులు, వారి కుటుంబాలకు చేయూతనిచ్చారు. ఈ ఫండ్ కోసం గత ఏప్రిల్ 22న ఖాతా ఏర్పాటైంది. ఆ నిధి నుంచి అర్హులైన వారికి నేరుగా సాయం చేశారు.
అర్హులైన బాధితుల వివరాలను దవాఖానల్లో ఈ టీం తెలుసుకుంటుంది. వారి అవసరాలకు అనుగుణంగా సంబంధిత దవాఖానలకు, ఆయా కుటుంబాలకు సాయం చేసేవారు.
ఈ గ్రూప్ ఏర్పాటు చేసిన వారిలో వివేకానంద అనే వ్యక్తి మాట్లాడుతూ చాలా మంది సాయం కోసం వేచి చూస్తున్నారన్నారు. వారికి సాయం చేయాలని ఉన్నా, ఎలా అన్నది తెలిసేది కాదన్నారు. మేం ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి కలిసి రావాలని కోరాం అని చెప్పారు.
వివకానందతోపాటు ఇబ్రహీంఖాన్, షాజాద్ అహ్మద్, అరుణిమ, ఇంతియాజ్, విభ, ఉదయ, అఫ్జల్, శివాజీ, శ్రుతి, ఆదిత్య కొథారీ, అర్చన, దివాకర్, జీలం బీ, మాధవన్, హర్ష్బిర్, శివంగి ఈ గ్రూప్లో సభ్యులుగా ఉన్నారు.
ఉద్యోగులకు ఆకర్షణీయ వీఆర్ఎస్?
వృద్ధిరేటు 8.3%కు కుదించిన ప్రపంచబ్యాంకు.. ఎందుకంటే?!
పియాజియో వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్, వేరియంట్లు ఇలా..
ఫ్రాంక్లిన్పై సెబీ రూ.5 కోట్ల ఫైన్
వృద్ధిరేటు 8.3%కు కుదించిన ప్రపంచబ్యాంకు.. ఎందుకంటే?!
ఆ రెండు బ్యాంకులపై ఆర్బీఐ ఫైన్.. ఎందుకంటే?!
ఇరాన్పై ఆంక్షలు ఎత్తేయకుంటే పెట్రోల్ పైపైకే!
కోవిడ్ ఔషధాలపై 5 శాతానికి జీఎస్టీ మినహాయింపు? ఇంకా..!!
బిట్ కాయిన్ ఒక స్కాం.. డాలర్కు వ్యతిరేకం
రేపు ఆకాశంలో ఆవిష్కృతమవనున్న అద్భుతం
జాతి వివక్ష ట్వీట్లు.. చిక్కుల్లో మరో ఇద్దరు స్టార్ ఇంగ్లండ్ క్రికెటర్లు
పీహెచ్సీలో ఆగిన రిఫ్రిజిరేటర్.. గడ్డకట్టిన 480 టీకా డోసులు