న్యూఢిల్లీ, జూన్ 8: కొత్తగా ప్రారంభించిన ఆదాయం పన్ను (ఐటీ) ఈ-ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిని వెబ్సైట్ను రూపొందించిన ఇన్ఫోసిస్, దాని చైర్మన్ నందన్ నిలేకనీ దృష్టికి మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకెళ్లారు. పన్ను చెల్లింపుదారుల నుంచి తన ట్విట్టర్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయని ట్వీట్ చేశారు. సోమవారం రాత్రి ఈ-ఫైలింగ్ 2.0ను ఐటీ శాఖ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నయా వెబ్సైట్ విశేషాలను ఉదయం నిర్మల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా, కాసేపటికే పోర్టల్లో సమస్యలున్నాయని యూజర్ల నుంచి పెద్ద ఎత్తున ట్వీట్లు వచ్చిపడ్డాయి. దీంతో ఆ సమస్యలను వెంటనే తొలగించాలని నిలేకనీకి నిర్మల ట్వీట్ చేశారు.