న్యూఢిల్లీ: గ్లోబల్ వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తమ కొవిడ్-19 వ్యాక్సిన్ విక్రయ ధరల విధానాన్ని సమర్ధించుకున్నది. అడ్వాన్స్ ఫండింగ్ ద్వారా తొలుత నిర్ణయించిన ధర కంటే 1.5 రెట్లు పెంచేసింది సీరం. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. కానీ శనివారం సీరం సంస్థ తమ నిర్ణయం సమర్ధనీయమేనని పేర్కొన్నది.
ఇప్పుడు వ్యాక్సిన్ల ఉత్పాదక సామర్థ్యం పెంచడానికి నిధులు పెట్టుబడులు పెట్టనున్నది సీరం. ఆస్ట్రా జెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి కొవిషీల్డ్ వ్యాక్సిన్ను డెవలప్ చేసింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. పుణెలో సీరంకు ఉత్పాదక యూనిట్ ఉంది.
ప్రైవేట్ దవాఖానలకు రూ.600, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, కేంద్రానికి సరఫరా చేసే వ్యాక్సిన్లపై రూ.150 వసూలు చేయనున్నట్లు ఈ వారం ప్రారంభంలో సీరం ప్రకటించింది. అంతర్జాతీయ ధరలతో పోలిస్తే సీరం వ్యాక్సిన్ ధర సరిగా లేదని ఆ సంస్థ పేర్కొంది.
మార్కెట్లో చౌక ధరకు లభిస్తున్న వ్యాక్సిన్ కొవిషీల్డ్ అని సీరం వ్యాఖ్యానించింది. వ్యాక్సిన్ తయారీ కోసం వివిధ దేశాలు అడ్వాన్స్ ఫండింగ్ చేసినందునే ప్రారంభ దశలో దాని ధర తక్కువగా నిర్ణయించామని పేర్కొంది.
భారతదేశంతోపాటు ప్రపంచ దేశాల ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ కింద ప్రారంభ సరఫరా ధరను తక్కువగా నిర్ణయించామన్నది సీరం. ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. నిరంతరం వైరస్ మ్యూటేషన్లు పెరుగుతున్నాయి.
ప్రజల ఆరోగ్యం రిస్క్ లో పడింది. ఈ క్రమంలో కరోనాపై పోరాటానికి ప్రాణాలను కాపాడటానికి వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి పెట్టుబడులు పెట్టాల్సి ఉందని సీరం వ్యాఖ్యానించింది. ఇతర ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు పెట్టే ఖర్చు కంటే తమ కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఖర్చు చాలా తక్కువ అని అభిప్రాయ పడింది.
ఆక్సిజన్ సరఫరా అడ్డుకున్న వాళ్లను ఉరితీస్తాం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు
క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చరిత్రలో ఈరోజు
స్టీల్ ప్లాంట్ల నుంచి 1.43 లక్షల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాలు!
ఆక్సిజన్ కు కటకట : అలాగైతే 24 గంటల్లో వ్యవస్థ కుప్పకూలుతుంది..
ఆక్సిజన్ కొరత.. ఆ దవాఖానలో కొత్త రోగులకు నో అడ్మిషన్
మళ్లీ గరీబ్ కల్యాణ్ యోజన: రెండు నెలలు పేదవాడికి 5 కిలోల బియ్యం ఫ్రీ
ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకుల రుణాలు.. ఎందుకంటే?!
ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెంటింగ్ : నిందితుడు అరెస్ట్
మహేష్ ఖాతాలో మరో రికార్డ్.. మైండ్ బ్లాక్ చేసిన సూపర్ స్టార్
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
అత్యంత ఖరీదైన, అతిపెద్ద స్మార్ట్టీవీని ఆవిష్కరించిన షియోమీ
భారత్ భయంకరమైన స్థితిలో ఉన్నది: ఆంథోనీ ఫౌసీ