Tripura | న్యూఢిల్లీ: త్రిపురలోని పశ్చిమ త్రిపుర లోక్సభ నియోజకవర్గంలో, రామ్నగర్ శాసనసభ స్థానంలో ఈ నెల 19న జరిగిన పోలింగ్లో అక్రమాలు జరిగాయని, మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు జరగలేదని సీపీఎం త్రిపుర శాఖ కార్యదర్శి జితేంద్ర చౌదరి ఆరోపించారు.
మజ్లిస్పూర్ సెగ్మెంట్లో 105.30%, ఖాయర్పూర్లో 100.15 శాతం, మోహన్పూర్ సెగ్మెంట్లో 109.09 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. కాగా, పోలింగ్ బూత్లో ఎన్నికల విధులను నిర్వహించిన పోలింగ్ అధికారులు తమ ఓట్లు తాము వేశారని, అందుకే ఇలా జరిగిందని అధికారులు చెప్తున్నారు.