Varun Gandhi | లక్నో: ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, అమేథీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు తన అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ కూడా రాయ్బరేలీలో తన అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో తన సిట్టింగ్ స్థానమైన పిలిబిత్ నుంచి బీజేపీ టికెట్ నిరాకరణకు గురైన వరుణ్ గాంధీ.. రాయ్బరేలి నుంచి పోటీచేస్తారనే ప్రచారం జరుగుతున్నది.
దీనిపై మీడియా ప్రతినిధులు వరుణ్ గాంధీని అడుగ్గా.. ధ్రువీకరించడం కానీ, ఖండించడం గానీ చేయలేదు. అంతర్గతంగా జరిగిన చర్చల గురించి బయట చెప్పడం సరికాదని ఆయన అన్నారు. రాయ్బరేలీ నుంచి గత లోక్సభ ఎన్నికల్లో పోటీచేసిన సోనియా గాంధీ.. ఈసారి రాజ్యసభకు వెళ్లిపోయారు. మరోవైపు ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా పోటీకి దిగుతారనే ప్రచారం జరుగుతున్నది.