ముంబై: అసలే బ్యాంకులకు వివిధ పండుగలు, ఇతర కారణాల వల్ల ఏప్రిల్లో సెలవులే సెలవులు. ఇక మధ్యలో సాంకేతిక అంతరాయంతో సేవలు అందుబాటులో ఉండవంటే వినియోగదారులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు.. ఎందుకంటే ఈ నెల 18వ తేదీన అంటే వచ్చే ఆదివారం ఆర్టీజీఎస్ సేవలు 14 గంటల పాటు అందుబాటులో ఉండవు. ఈ సంగతి స్వయంగా ఆర్బీఐ వెల్లడించింది.
సాంకేతిక సమస్యల కారణంగా ఈ నెల 18వ తేదీన ఆర్టీజీఎస్ సేవలు ఖాతాదారులకు అందుబాటులో ఉండవని తెలిపింది. ఈ నెల 17వ తేదీన బ్యాంకుల్లో బిజినెస్ లావాదేవీలు ముగిసినప్పటి నుంచి ఆర్టీజీఎస్ పనితీరును మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఆర్టీజీఎస్ సేవల్లో డిజాస్టర్ రికవరీ టైమ్ అప్గ్రేడ్ చేయాల్సి ఉందని వెల్లడించింది.
శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆర్టీజీఎస్ సేవలు అందుబాటులో ఉండవు. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (ఎన్టీఎఫ్టీ) వ్యవస్థలో మాత్రం సేవలు వినియోగదారులకు కొనసాగుతాయి.
కనుక సభ్య బ్యాంకులు తమ శాఖల్లోని ఖాతాదారులకు ఆర్టీజీఎస్ సేవలు అందుబాటులో ఉండబోవని.. చెల్లింపులకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించాలని ఆర్బీఐ సూచించింది.
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!
బెస్ట్ డైరక్టర్ జావో.. నోమాడ్ల్యాండ్కు నాలుగు బాఫ్టా అవార్డులు
కుంభమేళా.. కొవిడ్ నిబంధనలు పాటించని భక్తులు
బాఫ్టా అవార్డ్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్గా ప్రియాంక చోప్రా, నిక్
కరోనా ఎఫెక్ట్: అక్కడ 18 జిల్లాల్లో లాక్డౌన్
హరిద్వార్లో నిరంజని సాధవుల పుణ్య స్నానాలు
బెడ్ల కొరత.. వీల్ చైర్లపైనే రోగులకు చికిత్స
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!
క్రెడిట్ కార్డు సైజ్లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..