అసలే కరోనా కాలం..రూపాయి చేతిలో లేదని జనం గగ్గోలు పెడుతుంటే మరోవైపు జ్యువెలరీ షాపులు మాత్రం కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. దేశంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఎందుకిలా అంటే పసిడి ధర తగ్గుడమేనంటున్నారు. కరోనా కాలంలో బంగారంపై పెట్టుబడి పెట్టడం మంచిదని చాలామంది భావిస్తున్నారు. అంతేకాదు అంతేకాదు పెళ్లిళ్ల సీజన్ కూడా మరో కారణమంటున్నారు. దీనికి తోడు వచ్చే నెల్లో అక్షయతృతియా కూడా ఉంది కాబట్టి బంగారం కోనుగోళ్లు పెరిగాయని తెలుస్తోంది.
గత ఏడాది ఆగస్ట్ నెలలో ఆల్టైమ్ గరిష్టాన్ని తాకిని బంగారం ధర.. తర్వాతి నుంచి క్రమంగా పడిపోతూనే వచ్చింది. అప్పటి నుంచి చూస్తే ఇప్పటివరకు బంగారం ధర ఏకంగా రూ.10 వేలు పతనమైంది. దీంతో బంగారం కొనే వారు ఇది మంచి ఛాన్స్ అని భావించి తెగ కొనేస్తున్నారు. ఫలితంగా పసిడి దిగుమతులు భారీగా పెరిగాయి. మార్చి నెలలో బంగారం దిగుమతులు రెండేళ్ల గరిష్టానికి చేరాయి.