దుబాయ్: ముడి చమురు సరఫరా చేసే ఓపెక్ ప్లస్ దేశాల కూటమిలో సభ్య దేశాలు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో వచ్చేనెలలో ఎంత ముడి చమురు ఉత్పత్తి చేయాలన్న విషయం ఖరారు కాలేదు. పెరుగుతున్న డిమాండ్ను క్యాష్ చేసుకోవాలన్న వ్యూహం సౌదీ అరేబియాది.. కానీ తమ అవసరాలకు అనుగుణంగా రోజువారీ ఉత్పత్తి పెంచుకునేందుకు అనుమతించాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ డిమాండ్.. కానీ రెండు దేశాల మధ్య ప్రతిష్ఠంభనకు తెర పడలేదు.
ఇప్పటికిప్పుడు ముడి చమురు ఉత్పత్తి పెంపు సాధ్యమయ్యే సంకేతాలు కనిపించడం లేదు. ఒకవైపు ఆర్థిక రంగం రికవరీ దిశగా అడుగులు వేస్తున్న సమయంలో ముడి చమురు కొరత సరికొత్త సమస్యకు దారి తీయొచ్చు. ఓపెక్ ప్లస్ సభ్య దేశాల మధ్య ఐక్యత కొరవడితే గతేడాది మాదిరిగానే ప్రైస్ వార్ పునరావ్రుతం కానున్నది.
ఓపెక్ ప్లస్ సభ్య దేశాలు పోటీ పడి ముడి చమురు ఉత్పత్తి చేస్తే ధరలు పతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి చాలా సంక్లిష్ఠంగా మారింది. ఇరు పక్షాల మధ్య మున్ముందు చర్చలు పునరుద్ధరిస్తారని అంచనా వేస్తున్నారు.
ఒపెక్ ప్లస్ సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే ముడి చమురు సరఫరా పరిస్థితి మరింత కఠినం అవుతుంది. అదే జరిగితే సెప్టెంబర్ నాటికి బ్యారెల్ బ్రెట్ క్రూడ్ ఆయిల్ ధర 80 డాలర్లకు పెరుగుతుందని కన్సల్టెన్సీ సంస్థ యూబీఎస్ అనలిస్ట్ జియోవన్నీ స్టౌనోవో చెప్పారు. ఒపెక్ కూటమి అంగీకారానికి వస్తే సభ్య దేశాల మధ్య చర్చలు సాగుతాయి.
ఒకవేళ ముడి చమురు ఉత్పత్తి-సరఫరాపై అంగీకారానికి రాకపోతే వచ్చే నెలలో ముడి చమురు ధరలు పతనం అవుతాయని భావిస్తున్నారు. అయితే, వచ్చేనెలలో చమురు ఉత్పత్తి, ముడి చమురు ధరపై క్లారిటీ రావడానికి కొన్ని రోజులు పడుతుందని సౌదీ ఆరామ్ కో ఓ ప్రకటనలో తెలిపింది.
మరో కన్సల్టెన్సీ సంస్థ ఐఎన్జీ మాత్రం వచ్చే నెలలో ముడి చమురు ఉత్పత్తి మారకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పైపైకి దూసుకెళ్తాయని అంచనా వేస్తున్నది. ఒపెక్ సభ్య దేశాలు వచ్చే నెలలో భారీ మొత్తంలో ముడి చమురు ఉత్పత్తిని పెంచకపోవచ్చునని ఐఎన్జీ కమోడిటీస్ స్ట్రాటర్జీ అధిపతి వారెన్ ప్యాటర్సన్ చెప్పారు.
ఒప్పందం కుదరకపోతే గతేడాది మాదిరిగా ప్రైస్ వార్ తప్పక పోవచ్చునని ఐఎన్జీ వ్యాఖ్యానించింది. ఆగస్టు-డిసెంబర్ మధ్య రోజూ రెండు మిలియన్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా చేయడంతోపాటు తదుపరి ఒప్పందం పొడిగింపుపై చర్చించుకునే అవకాశం ఉందని పేర్కొంది.
ముడి చమురు ఉత్పత్తి పెంచకపోతే మాత్రం బ్యారెల్ ముడి చమురు ధర 85-90 డాలర్ల మధ్య తచ్చాడుతుందని ఇండస్ట్రీ కన్సల్టెన్సీ సంస్థ ఎఫ్జీసీ తెలిపింది. ఈ మేరకు సంస్థ చైర్మన్ ఫెరైదున్ ఫెషారాకీ స్పందిస్తూ.. వచ్చే మూడు వారాల్లో సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరొచ్చునన్నారు.
ఏకాభిప్రాయం కుదిరే వరకు ముడి చమురు ధరలు పెరిగిపోతాయని ఎఫ్జీఈ తెలిపింది. యూఏఈ స్వతంత్ర నిర్ణయం తీసుకోవడంతోపాటు ధరలు ఇలాగే కొనసాగొచ్చు. అదే జరిగితే అమెరికా తన షేల్ ఆయిల్ ఉత్పత్తి పెంచాల్సి రావచ్చు.
ప్రతిష్ఠంభనకు తెర దించడానికి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ మధ్య రహస్యంగా తెర వెనుక చర్చలు జరుగుతున్నాయి. కానీ ఉత్పత్తి పెంచాలన్న నిర్ణయానికి యూఏఈ కట్టుబడి ఉందని ఆర్బీసీ క్యాపిటల్ మార్కెట్స్ పేర్కొంది. ఒపెక్ ప్లస్ సభ్య దేశాల మధ్య ఒప్పందం కుదరకపోయినా,, ఉత్పత్తిలో మార్పు ఉండకపోవచ్చునని రిస్టాడ్ ఎనర్జీ తెలిపింది.
కర్నాటకం : యడియూరప్పపై టూరిజం మంత్రి తిరుగుబాటు
వరుడికి కట్నంగా ఆక్సిజన్..!
ప్రపంచంలోనే ఎత్తయిన గుర్రం బిగ్ జాక్ ఇకలేదు..!
విస్తారా ఎయిర్లైన్స్ బంపర్ ఆఫర్
ఇన్ కమ్ టాక్స్ ఫైల్ చేయడానికి సడలింపులు..
ఏడాదిలో మూడోసారి : టాటా కార్ల ధరలకు రెక్కలు!
రూ.15 లక్షల కోట్లు.. ప్రపంచ కుబేరుల్లో ఇంకా టాప్లోనే బెజోస్
ఆంక్షలపై తగ్గేందుకు సౌదీ ససేమిరా.. సంక్షోభం ముంగిట ఓపెక్?
5G రావడానికి ఎందుకంత లేటవుతుంది? ఆలస్యం మంచికేనా?
హైదరాబాద్ అమ్మాయితో ఆమీర్ఖాన్ ఎఫైర్.. విడాకులు అందుకేనా?