సుబేదారి, ఏప్రిల్ 26 : కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్ నడుస్తున్నది. 54వ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు చింత నిఖిల్పై అదే డివిజన్కు చెందిన మరో వర్గం దాడికి పాల్పడింది. ఈ దాడిలో నిఖిల్ తలకు గాయాలు కావడంతో ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. కేయూసీ సీఐ సంజీవ్ కథనం ప్రకారం.. ఈ నెల 24న మడికొండలో జరిగిన సీఎం రేవంత్రెడ్డి సభకు హనుమకొండ పోచమ్మకుంట నుంచి వాహనాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని నిఖిల్ 54డివిజన్ ప్రెసిడెంట్ కూడుక ప్రదీప్ను అడిగారు. అయితే సభ ముగిసిన తర్వాత రాత్రి ప్రదీప్ నిఖిల్ను మాట్లాడుకుందామని పెగడపల్లి డబ్బాలు జంక్షన్ సమీపంలోకి పిలిపించాడు. ఈ క్రమంలో నిఖిల్పై ప్రదీప్, అతడి అనుచరులు నవీన్, సందీప్ మరికొంత మంది దాడి చేసి గాయపర్చారు. బాధితుడి ఫిర్యాదుతో ప్రదీప్, అతడి అనుచరులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.