కేసముద్రం/కురవి/డోర్నకల్/బయ్యారం, ఏప్రిల్26: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద రూ. 24.77 లక్షల నగదును పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. కేసముద్రానికి చెందిన హరి నెకొండ్కకు రూ.18 లక్షల నగదును తీసుకెళ్తుండగా కేసముద్రం మండలం కోరుకొండపల్లి స్టేజీ వద్ద పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వంశీధర్ తెలిపారు. కురవి మండలం నేరడ శివారు బాల్యతండాకు చెందిన వ్యక్తి రూ.3.50లక్షల నగదును తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు కురవి ఎస్సై గోపీ తెలిపారు. డోర్నకల్ ఎస్సీ బీసీకాలనీ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద ఖమ్మం జిల్లా మంచుకొండకు చెందిన వినోద్ సహానీ నుంచి రూ.లక్ష స్వాధీనం చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. ముల్కలపల్లికి చెందిన బోడ సాయికుమార్ ఖమ్మం నుంచి బొలెరో వాహనంలో తీసుకొస్తున్న రూ.52వేలను సీజ్ చేశారు. ఇల్లెందు, మహబూబాబాద్ జాతీయ రహదారిపై గార్ల, బయ్యారం సరిహద్దు సత్యనారాయణపురం క్రాస్రోడ్డు వద్ద ఐపీఎస్ ట్రైనీ బయ్యారం ఎస్హెచ్వో చేతన్నితిన్, సీఐ రవికుమార్ నేతృత్వలో ఎస్సైలు మౌలానా, జీనత్ వాహన తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో వ్యాపారులు బరిగల ప్రేమ్కుమార్ రూ.75వేలు, శివలింగయ్య నుంచి రూ.లక్ష నగదు సీజ్ చేశారు.