మడికొండ, ఏప్రిల్ 26 : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెల 3న మడికొండకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. ఈ మేరకు బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని బీజేపీ శ్రేణులు శుక్రవారం పరిశీలించారు. అంతకుముందు ఖిలా వరంగల్లోని మైదానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్, పార్లమెంట్ క్లస్టర్ ఇన్చార్జి, రాష్ట్ర క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, గంట రవి, పార్లమెంట్ ప్రభారీ మురళీధర్గౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, ఎర్రబెల్లి ప్రదీప్రావు, కీర్తిరెడ్డి, కేశవరెడ్డి, కుమారస్వామి, నాయకులు పొనగోటి వెంకట్రావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం మహేందర్, నాయకుడు బొల్లికొండ వినోద్ పాల్గొన్నారు.