లండన్: సెంట్రల్ ఇంగ్లండ్లోని ఓ ప్రాంతం.. బయటకు గంజాయి ఫామ్గా కనిపిస్తున్నది. కానీ అక్కడ తనిఖీకి వెళ్లిన డ్రగ్స్ పోలీసులు షాక్ తిన్నారు. 24 గంటలూ అక్కడికి సందర్శకులు వెళుతున్నారు. విస్త్రుతంగా వైరింగ్, వెంటిలేషన్ డక్ట్స్ ఏర్పాటై ఉన్నాయి. అనూహ్య రీతిలో వేడి జనరేట్ అవుతున్నది.
అనుమానంతో డ్రగ్స్ పోలీసులు పూర్తిగా తనిఖీ చేయడంతో నేషనల్ గ్రిడ్ నుంచి భారీగా విద్యుత్ దొంగిలిస్తున్న సంగతి బయట పడింది. బర్మింగ్ హంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో అక్రమంగా బిట్ కాయిన్ మైనింగ్ చేస్తున్నారని వెస్ట్ మిడ్ లాండ్స్ పోలీసులు కనుగొన్నారు.
మేం ఊహించిన దానికి భిన్నంగా జరుగుతున్నదని సార్జంట్ జెన్నిఫర్ గ్రిఫిన్ చెప్పారు. బయటకు చూడటానికి గంజాయి సాగు చేస్తున్న సెటప్ ఏర్పాటు చేశారు. కానీ వెస్ట్ మిడ్ల్యాండ్స్లో ఇది రెండో క్రిప్టో మైనింగ్ అని విశ్వసిస్తున్నానన్నారు.
ఈ ఫామ్లో 100 కంప్యూటర్లు, ఎలక్ట్రిసిటీ మీటర్లు అనుసంధానం చేశారు. ఈ ఫామ్ యజమానిని విచారిస్తున్నామని జెన్నిఫర్ గ్రిఫిన్ అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ తాము అరెస్ట్ చేయలేదన్నారు.
క్రిప్టో కరెన్సీ మైనింగ్ కోసం భారీ మొత్తంలో ఇంధనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ నాలుగు నెలల పాటు అన్ని రకాల క్రిప్టో కరెన్సీల మైనింగ్ను నిషేధించింది.
మహమ్మారి అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
రాందేవ్ వ్యాఖ్యలపై ఆగని రగడ : చర్చకు రావాలని ఐఎంఏ సవాల్
అంత్యక్రియలు జరిపాక.. మనిషి తిరిగొచ్చాడు..! అసలేం జరిగిందంటే
బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్లకు ఇన్సూరెన్స్ ఉంటుందా ?
ప్రతి నెల గ్యాస్ బండ ధర మోతే.. ఇంకా..!
ఐటీ రూల్స్ సరే.. వాట్సాప్ ప్రైవసీ పాలసీ కట్టడి మాటేంటి?!
చైనాలో ప్రత్యక్షమైన శ్రీలంక యువరాణి.. మంటలు రేపుతున్న వింత కథనాలు