న్యూఢిల్లీ: రిలయన్స్ ఈ నెల 24న జియో 5జీ స్మార్ట్ ఫోన్, లాప్టాప్ ఆవిష్కరించనున్నదని వార్తలు షికారు చేస్తున్నాయి. ఇటీవల ప్రతియేటా రిలయన్స్ వార్షిక సమావేశంలో నూతన ఆవిష్కరణలు వెలుగు చూస్తున్నాయి. దీంతో త్వరలో జరిగే రిలయన్స్ వార్షిక సమావేశంపై అందరి ద్రుష్టి పడింది. సెర్చింజన్ గూగుల్ సహకారంతో 5జీ ఫోన్ను జియో అభివ్రుద్ధి చేస్తున్నది.
అయితే, 5జీ ఫోన్తోపాటు కొన్ని హార్డ్వేర్ ఉత్పత్తులను త్వరలో ఈ నెలాఖరులో జరిగే వార్షిక సమావేశంలో ఆవిష్కరించవచ్చునని తెలుస్తున్నది. ప్రస్తుతం 5జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్ అకస్మాత్గా పెరుగుతున్నది.
తొలుత హై ఎండ్ స్మార్ట్ ఫోన్లకు పరిమితమైంది మార్కెట్. జూన్లో పలు మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్లు వెలుగు చూశాయి. చౌక ధరకు స్మార్ట్ఫోన్ అందుబాటులోకి తేనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ ఇటీవల ప్రకటించారు.
ఆండ్రాయిడ్ వర్షన్ను గూగుల్ స్రుష్టించిన సంగతి తెలిసిందే. 5జీ జియో ఫోన్ కోసం ప్రత్యేకంగా జియో ఓఎస్ అని పిలుస్తారని తెలుస్తున్నది. ఎల్వీఎఫ్ బ్యానర్లో జియో ఒక స్మార్ట్ ఫోన్ను ఆవిష్కరించనున్నది.
2.4 అంగుళాల డిస్ప్లే, 320ఎక్స్, 240ఎక్స్ పిక్సెల్స్ రిజొల్యూషన్, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ స్టోరేజీ సామర్థ్యంతో జియో 5జీ ఫోన్ రావచ్చు. ఖాయి ఓఎస్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు ఫేస్బుక్, యూ ట్యూబ్, వాట్సాప్లకు మద్దతుగా ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ.5000 ఉండొచ్చునని భావిస్తున్నారు.
జూన్ 30 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ను పొడిగించిన పేటీఎం…
ఎస్బీఐ కస్టమర్లకు గమనిక.. ఆ పత్రాలు సమర్పిస్తేనే సేవలు
రాష్ట్ర ప్రభుత్వానికి 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు
తమిళనాడులో మరో వారం లాక్డౌన్ పొడగింపు
చరిత్రలో ఈరోజు : ఐదుగురిలో తొలిసారి ఎయిడ్స్ గుర్తింపు
ట్విటర్కు చివరి హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం
కొవిడ్ కిట్ లో కరోనిల్ : పతంజలి ప్రతిపాదన వ్యతిరేకించిన ఐఎంఏ
ఢిల్లీ అన్లాక్.. సరి, భేసి విధానంలో మాల్స్, మార్కెట్లకు అనుమతి
వెంకయ్య ఖాతాకు బ్లూటిక్ రీస్టోర్ చేసిన ట్విటర్
జైసల్మేర్ జిల్లాలో పవర్గ్రిడ్ ఆక్సిజన్ ప్లాంటు…
ఆరెస్సెస్ చీఫ్ భగవత్ ట్విట్టర్ బ్లూటిక్ రిమూవ్, అయితే!
ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చార్జీలు.. ఏ బ్యాంకులో ఎంత అంటే …?