న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు మరింత ప్రియం కానున్నాయి. లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ ధర రూ.3 వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ముడి చమురు సంస్థలకు వచ్చే నష్టాలను పూడ్చుకోవడానికి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పడం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాల కథనం.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనెల రెండో తేదీన ముగుస్తాయి. ప్రజల ద్రుష్టిని మళ్లించడానికి కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు.
ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు 26 సార్లు పెంచేసింది. జనవరిలో 10 సార్లు, ఫిబ్రవరిలో 16 సార్లు పెంచింది. కానీ మార్చిలో ముచ్చటగా మూడుసార్లు, ఈ నెలలో ఇప్పటివరకు ఒకసారి వీటి ధరలు తగ్గించింది. చివరిగా ఫిబ్రవరి 27వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ నెల 16వ తేదీన చివరిగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
దేశంలో ఏదో ఒక రాష్ట్ర అసెంబ్లీకి గానీ, లో్క్ సభకు గానీ ఎన్నికలు జరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు యధాతథంగా కొనసాగించడం సంప్రదాయంగా వస్తున్నది. 2020 అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ ఏడో తేదీ వరకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నవంబర్ 10వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి.
2020 సెప్టెంబర్ రెండో తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు పెట్రోల్, డీజిల్ ధరలు యధాతథంగా కొనసాగాయి. నవంబర్ 20 నుంచి డిసెంబర్ ఏడో తేదీ వరకు 18 రోజుల్లో కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలు 15 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశాయి.
అటుపై 2021 జనవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 23వ తేదీ వరకు పెట్రోల్, డీజిల్ ధరల జోలికి కేంద్ర చమురు సంస్థలు వెళ్లనే లేదు. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగడమే దీనికి కారణం. తర్వాత కాలంలో కరోనా మహమ్మరిని నియంత్రించడానికి కేంద్రం విధించిన లాక్ డౌన్ తో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2018 మే నెలలో కేంద్ర చమురు సంస్థలు 19 రోజులు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఊసే ఎత్తలేదు. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర ఐదు డాలర్లు పెరిగినా కేంద్ర చమురు సంస్థలు నోరు మెదపలేదు.
2017లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినప్పుడు కేంద్ర చమురు సంస్థలు ధరలు పెంచకుండా మౌనంగా ఉండిపోయాయి. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఆ ఏడాది జనవరి 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేసేవి కేంద్ర సంస్థలు.
ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి 2017 డిసెంబర్లో ఎన్నికలు జరిగినప్పుడు కేంద్ర చమురు సంస్థలు గమ్మున ఉండిపోయాయి. అప్పట్లో 14 రోజులు ధరల పెంపు ఊసే లేదు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్యారెల్ ముడి చమురు ధర సగటున 61 డాలర్లు పలికింది. గత నెలలో అది 64.73 డాలర్లకు పెరిగింది. ఇప్పుడు బ్యారెల్ క్రూడాయిల్ ధర 65 డాలర్లకు చేరుకున్నది. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మోదీ ప్రభుత్వ హాయాంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గి వచ్చినా ప్రజలకు లబ్ధి చేకూరడం లేదు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు ముడి చమురు బ్యారెల్ ధర 106.85 డాలర్లు పలికింది. కరోనాతో వాడకం పడిపోయి క్రూడ్ ధర తగ్గింది. తాజాగా 65 డాలర్లకు చేరుకున్నది. దీనికి అనుగుణంగా ధర తగ్గడానికి బదులు లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటేసింది..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గినా జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు. క్రూడ్ ధరకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి బదులు కేంద్రం ఎక్సైజ్ సుంకాలు విధించింది. తాజాగా పెరుగుతున్న క్రూడాయిల్ ధరకు అనుగుణంగా ఎక్సైజ్ సుంకాలు తగ్గించడం లేదు.
2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు లీటర్ పెట్రోల్ మీద రూ.10.38, డీజిల్ మీద రూ.4.52 ఎక్సైజ్ సుంకం విధించేది కేంద్రం. ఇప్పుడు పెట్రోల్పై రూ.32.90, డీజిల్ మీద రూ.31.80 ఎక్సైజ్ సుంకం పెరిగింది. మోదీ సర్కార్ 13 దఫాలు ఎక్సైజ్ సుంకం పెంచేసింది. చివరిసారిగా గతేడాది మేలో పెంచేశారు.
ఎస్బీఐ ఆర్థికవేత్తల నివేదిక ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే దాని ధర రూ.78 మాత్రమే ఉంటుందని తేల్చారు. బ్యారెల్ ముడి చమురు ధర 65 డాలర్లయితే.. లీటర్ పెట్రోల్ ధర రూ.78, లీటర్ డీజిల్ ధర రూ.71 పలుకుతుంది. కానీ పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు లేదు.
18 ఏళ్లు నిండిన వారికి ఈ నెల 24 నుంచే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్
అక్రమంగా నిలువ ఉంచిన 70 ఆక్సిజన్ సిలిండర్ల సీజ్
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
వణికిస్తున్న ట్రిపుల్ మ్యుటెంట్.. ఎందుకంత డేంజర్? ఏం చేయాలి?
సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట విషాదం..
నెగెటివ్ వచ్చినా.. బయటినుంచి వస్తే క్వారంటైన్కే
‘ప్రాణ’గండం!! .. ఊపిరాడని ఉత్తరాది
కొవిషీల్డ్ ధరల్లో తేడాలెందుకు? అందరికీ వ్యాక్సినేషన్ అక్కర్లేదా?!
అసలు ఓ ప్లాన్ ఉందా.. ఆక్సిజన్, వ్యాక్సినేషన్పై కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం
వ్యాక్సిన్ విధానాన్ని తప్పుపట్టిన సోనియా గాంధీ