సింగపూర్: క్రిప్టో కరెన్సీ దిగ్గజం బిట్ కాయిన్ అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నది. ఇంతకుముందు బిట్ కాయిన్ల ద్వారా తమ కార్ల క్రయ విక్రయాలను అనుమతిస్తామని గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించారు. భారీగా బిట్ కాయిన్లు కొనుగోలు చేశామని ప్రకటించడంతో దాని విలువ పైపైకి దూసుకెళ్లింది. కానీ ఎలన్ మస్క్ యూ-టర్న్ తీసుకున్నారు.
ఈ వారంలోగా కొన్ని బిట్ కాయిన్లను విక్రయిస్తామని, ఇప్పటికే కొన్ని బిట్ కాయిన్లు అమ్మేశామని ఎలన్ మస్క్ ప్రకటించారు. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్లో ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీలను విక్రయించడానికి తెగబడ్డారు.
ఫలితంగా బిట్ కాయిన్ విలువ సోమవారం తొమ్మిది శాతానికి పైగా పతనమైంది. దాని విలువ 42,185 డాలర్లకు పడిపోయింది. ఫిబ్రవరి ఎనిమిదో తేదీ తర్వాత బిట్ కాయిన్ అతి కనిష్ఠ స్థాయి ఇదే.
ఎథిరియం విలువ 8 శాతం పడిపోయి 3,227.22 డాలర్లకు పతనమైంది. మరో డోజ్ కాయిన్ విలువ సుమారు ఏడు శాతం పడిపోయింది. డోజ్ కాయిన్ విలువ 0.48 డాలర్లకు చేరువైంది.
పర్యావరణ పరిరక్షణ కోసం తమ టెస్లా కార్ల కొనుగోళ్లపై బిట్ కాయిన్ చెల్లింపులను నిలిపివేస్తామని ఎలన్ మస్క్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని సమర్ధించుకున్న మస్క్.. తాజాగా ఆదివారం తమ సంస్థ.. బిట్ కాయిన్లను విక్రయించేస్తామని చెప్పారు.
ఎయిర్టెల్ థాంక్స్ యాప్లో వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు!
Amazon miniTV: అమెజాన్ మినీ టీవీ లాంచ్.. పూర్తిగా ఉచితం
మౌత్వాష్ ఆర్డర్ చేస్తే.. స్మార్ట్ఫోన్ వచ్చింది!
బ్రిటన్ వైపు ఇండియన్ సంపన్నుల చూపు.. నిపుణులు కూడా..!
Corona టైం..పరిమళించిన మానవత్వం: అంబులెన్స్ డ్రైవర్గా ఎన్నారై
ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్ ఎఫ్డీ కన్నా బెటర్
పరపతికి గీటురాయి సిబిల్ స్కోర్
సాలిడ్ స్టేట్ బ్యాటరీ.. ఎలక్ట్రిక్ వాహనాల్లో గేమ్ చేంజర్?!
బంగారం vs క్రిప్టో కరెన్సీ.. పెట్టుబడికి ఏది బెస్ట్? గోల్డ్కే ఇండియన్ల మొగ్గు!!
అక్షయ తృతీయకు డిమాండ్ లేకున్నా.. పెరిగిన బంగారం దిగుమతులు
ఎయిరిండియా ప్రైవేటీకరణ ఈ ఏడాది డౌటే!
కొవిడ్ దెబ్బ: ఆతిథ్య రంగానికి రూ.1.30 లక్షల కోట్ల నష్టం!!