(ATM Robbery) కడప : పట్టణ శివారులో ఉన్న ఓ బ్యాంకు ఏటీఎంలో దొంగలు పడ్డారు. గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎంను తెరిచిన దొంగలు.. దానిలో నుంచి దాదాపు రూ.17 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బ్యాంకు సిబ్బంది సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి దొంగలు పట్టుకునేందుకు బృందాలుగా బయల్దేరారు.
కడప పట్టణం శివారులో ఉన్న కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని ఎస్బీఐ ఏటీఎం ఉన్నది. ఈ ఏటీఎంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎంను తెరిచి.. అందులో ఉన్న రూ.17 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐదుగురు వ్యక్తులు ఏటీఎంలోకి ప్రవేశించారు. అందులోని సీసీ కెమెరాలను రికార్డింగ్ చేయకుండా వాటిపై స్ప్రే చేశారు. అనంతరం ఏటీఎం మిషన్ను గ్యాస్ కట్టర్తో కట్ చేసి నగదు చోరీకి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం ఏటీఎం చోరీని గమనించిన బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ వెంకట శివారెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంతో పరిసర ప్రాంతాల్లో ఆధారాలు సేకరించారు. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..