Youth | తన భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణ కేంద్రంలోని పాత హరిజనవాడకు చెందిన కరగల్ల బాల స్వామి యువకుడు మద్యం సేవించాడు. ఆ మద్యం మత్తులో స్థానిక ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కాడు.
తన భార్య కాపురానికి రావడం లేదంటూ సెల్ టవర్పైకి ఎక్కి కూర్చుని హల్ చల్ చేశాడు. స్థానికుల సహాయంతో సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాల స్వామిని సెల్ టవర్పై నుంచి కింది దింపే ప్రయత్నం చేస్తున్నారు.