(Mudragada) కాకినాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాసి.. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. ఐదు రోజుల పాటు కోడి పందేలు, ఎడ్ల పందేలు, ఇతర ఆటలను సంప్రదాయ పద్ధతిలో జరుపుకునేలా చూడాలని లేఖలో కోరారు. ఇది చాలా సున్నితమైన అంశమైనందున ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. కోడి పందేలు జల్లికట్టు మాదిరి ప్రమాదకరమైన ఆటలు, ఉత్సవాలు కావని స్పష్టం చేసిన ఆయన.. కోడి పందేల ముసుగులో ప్రజలను జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టవద్దని ముఖ్యమంత్రిని కోరారు.
1978 నుంచి 2004 వరకు కోడి పందేల కోసం సాధారణంగా పోలీసు శాఖ నుంచి సులువుగా అనుమతి పొందేవారని ముద్రగడ గుర్తు చేశారు. ఈ క్రీడలకు పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం సమస్య ఇబ్బందికరంగా మారిందన్నారు. సంక్రాంతి, ఉగాది పండుగలను 5 రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకునేలా శాశ్వత ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సంక్రాంతి పండగ సందర్భంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా కోడి పందేలు జోరుగా సాగుతాయి. అయితే, కోర్టు ఆదేశాల మేరకు కోడి పందేలు నిర్వహించకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..