(India Skills) విశాఖ : ఇండియా స్కిల్స్ 2021 దక్షిణ భారత రీజనల్ పోటీలు విశాఖలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో యువత వివిధ విభాగాల్లో తమ నైపుణ్యాలు ప్రదర్శించి విశేషంగా ఆకట్టుకున్నారు. విశాఖలోని వివిధ ప్రదేశాల్లో పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను జ్యోతి వెలిగించి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రారంభించారు.
భవిష్యత్లో కీలకంగా ఉండే రంగాల్లో నైపుణ్యం కలిగిన యువతను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. అభిరుచి, ఆసక్తి ఉన్న యువతను ఎంపిక చేసుకుని వారికి వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. దీనిలోభాగంగా ఇండియా స్కిల్స్ 2021 పేరిట దేశవ్యాప్తంగా పోటీలు నిర్వహిస్తున్నారు. విశాఖ వేదికగా నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న యువత.. తమ నైపుణ్యాలను ప్రదర్శించి అబ్బురపరిచారు. విశాఖలోని 11 ప్రాంతాల్లో జరిపిన 52 విభాగాల పోటీల్లో 500 మంది పాల్గొన్నారు. ఒక్కో విభాగం నుంచి ఇద్దర్ని విజేతలుగా ఎంపికచేసి జాతీయస్థాయి పోటీలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో రాణిస్తే వచ్చే సంవత్సరం చైనాలో జరిగే ప్రపంచ స్థాయి పోటీల్లో భారత్ తరఫున పాల్గొనే అవకాశం లభిస్తుంది. యువత తమ లోపాలను సవరించుకుని భవిష్యత్ను నిర్దేశించుకునేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని కర్ణాటకకు చెందిన స్కిల్ డెవలప్మెంట్ అధికారి కవిత గౌడ చెప్పారు.
వైరస్తో ఊబకాయులకు యమ డేంజర్ అంటున్న నిపుణులు
వాట్సాప్లో హలో మమ్మీ! హలో డాడీ.. అంటూ వచ్చే మెసేజ్లతో జాగ్రత్త!.. ఎందుకంటే..
వేరియంట్కు స్పానిష్ ఫ్లూకి ఉన్న పోలిక ఏంటి?
అక్కడి నీళ్లలో తేలియాడొచ్చు.. ఈత రాకున్నా అస్సలు మునగరు : వైరల్ వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..