(students missing) గుంటూరు : మంగళగిరిలో నలుగురు విద్యార్థులు అదృశ్యమైన విషయం స్థానికంగా కలకం రేపుతున్నది. విద్యార్థులు ఎలా అదృశ్యమయ్యారు? ఎక్కడికి వెళ్లి ఉంటారు? అనేది చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కనిపించకుండా పోయిన నలుగురు చిన్నారుల కోసం వెతకడం మొదలుపెట్టారు.
మంగళగిరి పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజీవ్ గృహకల్పకు చెందిన నలుగురు విద్యార్థులు వెంకటేశ్, ప్రభుదేవ, సంతోష్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు. మరో విద్యార్థి వెంకటేశ్ ఎర్రబాలెంలోని ఓ ప్రైవేట్ స్కూళ్లో చదువుతున్నాడు. ఎప్పటి మాదిరిగానే స్కూల్కు వెళ్లిన వీరంతా క్లాస్ రూమ్లో పుస్తకాల బ్యాగులు పెట్టి బయటికెళ్లిపోయారు. సాయంత్రం స్కూల్ విడిచిపెట్టే సమయానికి వచ్చి బ్యాగులు తీసుకుంటుండగా గమనించిన టీచర్లు వారిని అడ్డుకున్నారు. స్కూల్కి రాకుండా ఎక్కడ తిరుగుతున్నారంటూ ప్రశ్నించి, మరుసటి రోజు ఉదయం పేరెంట్స్ను తీసుకుని రావాలని గదమాయించారు.
దీంతో భయపడిపోయిన విద్యార్థులు మరో విద్యార్థి వెంకటేశ్తో కలిసి వెళ్లిపోయారు. తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆదుర్దాకు గురైన తల్లిదండ్రులు.. తెలిసివారి వద్ద ఆరా తీశారు. టీచర్లు తిట్టినందునే ఊరు విడిచివెళ్లిపోయినట్లుగా తోటి విద్యార్థుల ద్వారా తెలుసుకున్న పేరెంట్స్.. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విద్యార్థుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..